పెద్దపల్లి : ప్రతి ఒక్కరు పట్టణ, పల్లె ప్రగతి ప్రాముఖ్యతలను తెలుసుకొని సహకరించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను కోరారు.పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని హరితాహారంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చి ఆరోగ్య తెలంగాణకు తెలంగాణకు పాటుపడుదామని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.