నిర్మల్ : స్వాతంత్య్ర వీరుల త్యాగాలను స్మరించుకుందామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వలన మనకు స్వాతంత్రం వచ్చిందని, అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు.
వత్రోత్సవాలను 15 రోజుల పాటు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని చెప్పడానికి గర్విస్తున్నాను.
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.