హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టి కి తీసుకెళ్లారు.
టీ హబ్, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తెలంగాణకు రావడానికి తీసుకుంటున్న ప్రోత్సాహకాలను వివరించారు. రంజిత్ రెడ్డి ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, 2021 జూన్ 29 న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ స్టీరింగ్ కమిటీ సమావేశమై తన 2వ సమావేశంలో ఈ విషయమై చర్చించి పలు మార్గదర్శకాలు ఇస్తూ సూచనలు చేసిందన్నారు.
వాటిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎంపీ రంజిత్ రెడ్డి కి కేంద్ర మంత్రి వివరించారు.