కామారెడ్డి: కామారెడ్డి జిల్లా (Kamareddy) మాచారెడ్డి మండలం అక్కాపూర్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. అక్కాపూర్ (Akkapur) శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది. పంట పొలాల్లో చిరుత పాదముద్రలను గుర్తించిన స్థానికులు పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది.. అవి పులిలేనని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.