శంషాబాద్ రూరల్, జూన్ 27 : శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో శనివారం చిరుతపులి కలకలం రేపింది. చిన్మయ విద్యాలయంవద్ద చిరుత కనిపించిన్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఫారెస్టు అధికారులు ఎయిర్పోర్టులోని వివిధ ప్రాతాలను పరిశీలించారు. ఎక్కడా చిరుత జాడ కనిపించలేదు. స్థానికులు చూసింది చిరుతకాదని, అడవిపిల్లి కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.