ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 13 : వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు చిరుత కనిపించింది. ఖిల్లాఘణపురం మండలం సోలీపురం గ్రామానికి చెందిన నందకిశోర్, అల్లమాయిపల్లికి చెందిన యుగంధర్ సోమవారం రాత్రి వనపర్తి నుంచి కారులో వస్తున్నారు. ఖిల్లాఘణపురం సమీపంలోకి రాగానే పెద్దగుట్ట వైపు నుంచి రోడ్డుదాటుతూ చిరుత కనిపించింది. దీంతో వాహనదారులు భయపడి కారును రోడ్డుపై నిలిపి లోపలే కూర్చున్నారు. చిరుత వెళ్లిన తరువాత ఇంటికి చేరుకున్నారు. చిరుత సంచారం ఎక్కువైందని, అధికారులు ఎలాగైనా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.