నిజామాబాద్ : నవీపేట మండలం మోకాన్పల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామ శివారులో నివాస ప్రాంతాల్లో రెండు చిరుత పులుల సంచారం మూలంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈరోజు ఉదయం కస్తూర్బా బాలికల విద్యాలయం వెనుక ఉన్న గుట్టపై చిరుత కనిపించడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికి స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.