Gutha Sukhender Reddy | నల్లగొండ : మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్మరించుకున్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడే గొప్ప మేధావి పీవీ నరసింహా రావు అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎనలేని సేవ చేశారన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పెంచారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐతగొని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు, హరికృష్ణ, మాజీ ఎంపీపీ దైదా రజిత రెడ్డి, రామలచ్చయ్య, మునాస వెంకన్న, చిలకరాజు శ్రీనివాస్, కేశవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.