హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పిస్తూ కళశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలంగాణ ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. సంజీవయ్య, కడారు సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రం (సీతాఫల్మండి), రాజేందర్(ఖైరతాబాద్), గీతాలక్ష్మీ (నారాయణగూడ), వై. సత్యనారాయణ(జగిత్యాల్), జి. రాజారెడ్డి(వరంగల్), వి. శ్రీనివాస్(అగ్రహారం), నిఖత్ అంజుమ్(శేరిలింగంపల్లి), ఎ. నర్సయ్య(జనగాం), ఎండీ జకీరుల్లా(ఖమ్మం), కె. మల్లేశం(హన్మకొండ), కె. ప్రభు(ఇబ్రహీమ్పట్నం) తదితరులు పదోన్నతులు పొందినవారిలో ఉన్నట్లు వారు వివరించారు.