హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్(Lecturer) పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి (Suicide attempt) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలోని (Veldanda) ప్రభుత్వ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గమనించిన సిబ్బంది వెంటనే కల్వకుర్తిలోని ఓ దవాఖానలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.