హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీఎస్జీసీసీఎల్ఏ- 475) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, సురేశ్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు.