మెట్పల్లి, మార్చి 21: జడ్పీటీసీ భర్త, కాంగ్రెస్ నాయకుడి దాడిని నిరసిస్తూ గురువారం దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో దళిత సామాజిక వర్గానికి చెందిన తండ్రీ కొడుకులపై దాష్టీకానికి పాల్పడిన జడ్పీటీసీ భర్త కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డితోపాటు అతనికి సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మెట్పల్లిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు.
దళితులను కులం పేరిట దూషిస్తూ దాడులకు పాల్పడ్డ నేర చరిత్ర ఉన్న శ్రీనివాస్రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు.