మారుతీనగర్, ఆగస్టు 12: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ నెల 14,15 తేదీ ల్లో నిర్వహించను న్న ‘ప్రపంచ కార్మికుల వలసలు’ అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజ్కుమార్కు ఆహ్వానం అందించింది. ఐవోఎం, ఎంఎఫ్ఏల సంయుక్త ఆధ్వరంలో ఈ స దస్సు జరుగనున్నది.
‘తెలంగాణ ప్రము ఖ గల్ఫ్ వలస కార్మికుల సంఘం ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం’ నుంచి ప్రాతిని ధ్యం వహించనున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని ఈ నెల 4న ఈ మెయి ల్ ద్వారా ఆహ్వానాన్ని పొందినట్టు రాజ్కుమార్ తెలిపారు. గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, వారు ఎదుర్కొంటున్న సమస్య లు, పరిష్కారం అంశాలపై ప్రసంగించనున్నట్టు రాజ్కుమార్ పేర్కొన్నారు.