హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): భాషా పండితుల పదోన్నతులు, ఇతర సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరి ష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి హామీతో కొద్ది రోజులుగా 9, 10 తరగతుల బోధనను బహి ష్కరించిన భాషా పండితులు తమ నిర్ణయాన్ని మార్చుకొని సోమవారం నుంచి పాఠాలు బో ధించేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ బదిలీలు, పదోన్నతుల షెడ్యూ ల్లో భాషాపండితులకు అవకాశం కల్పిం చకపోవడంతో కొద్దిరోజులుగా 9, 10 తరగతుల తెలుగు, హిందీ, ఉర్దూ బోధనను వారు బహిషరించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదని భావించిన విద్యాశాఖ మంత్రి శనివారం జేఏసీ నాయ కులతో సమావేశమయ్యారు. భాషా పండి తులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.