మెదక్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను జమునా హేచరీస్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు సంబంధించిన పంచనామా పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. మెదక్, నర్సాపూర్, తుప్రాన్ ఆర్డీవోల సమక్షంలో పంచనామా జరిగింది. ఈ సందర్భంగా 65 మంది అసైనీలకు పట్టదార్ పాస్ పుస్తకాలు, ఇతర యాజమాన్య పత్రాలను అందించారు. దీంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సీ మదన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అయితే హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు చెందిన జమునా హేచరీస్ 85 ఎకరాల 19 గుంటల అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు గుర్తించింది.