వెల్దండ, ఏప్రిల్ 9 : తమకు పరిహారం అందించాకే ఇర్విన్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించనున్న ఇర్విన్ రిజర్వాయర్ కోసం చెట్ల సర్వేకు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు గురువారం రాగా.. కనీస సమాచారం లేకుండా చెట్ల సర్వే చేయడం ఏమిటని అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు.
ఈ రిజర్వాయర్ కారణంగా కోల్పోతున్న భూములకు పరిహారం ఖరారు చేసేంతవరకు సర్వే చేయడానికి వీలులేదని వారు తేల్చి చెప్పారు. సర్వేను నిలిపివేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.