నల్లగొండ: చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు వీక్షించాలని ఉందా.. అయితే ప్రయాణానికి సిద్ధమవండి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. సాగర్లో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది. మళ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయల్దేరి సాగర్ వస్తుందని అధికారులు తెలిపారు.
సాగర్ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200గా టికెట్ధర నిర్ణయించారు. రెండు వైపులా ప్రయాణానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2 వేలు తీసుకుంటారు.