యాదాద్రి, ఆగస్టు 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణతంతు జరిపారు. శ్రావణ మాసంలో భాగంగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన అత్యంత వైభవంగా కొనసాగుతున్నది. 11 వేల మంది భక్తు లు రాగా.. ఖజానాకు రూ.12,95,275 ఆదా యం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
నేటి నుంచి పవిత్రోత్సవాలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటిరోజు కంకణధారణ పూజ, మృత్స్యంగ్రహణం, పాలికాది హోమం నిర్వహిస్తారు. ఈ వేడుకల సందర్భంగా 8, 9వ తేదీల్లో భక్తులతో నిర్వహించే నిత్య, శాశ్వత తిరుకల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమాన్ని రద్దు చేస్తున్నట్టు ఈవో గీత తెలిపారు.