యాదగిరి గుట్ట , యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్టలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి (Mlc Chinnap Reddy) కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి బంగారు శటగోపము తయారీ కోసం రూ. 62లక్షల డీడీ(DD)ని ఆలయ అధికారులు ఉడెపు రాజు, నరేశ్కు అందజేశారు.
స్వామివారి ఒకరోజు ఆదాయం రూ. 32.15 లక్షలు
కాగా ఆలయానికి గురువారం ఒక్కరోజే రూ 32,15,413 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,99,000, సుప్రభాతం ద్వారా రూ. 2,300, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,37,100, వ్రతాల ద్వారా రూ. 1,61,600, వాహన పూజల ద్వారా రూ. 9,600, వీఐపీ దర్శనం ద్వారా రూ. 1,05,000, ప్రచారశాఖ ద్వారా రూ. 19,350 ఆదాయం(Income) సమకూరిందని వివరించారు.
పాతగుట్ట ద్వారా రూ. 42,290, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 3,50,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 1,01,496, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,12,600, శివాలయం ద్వారా రూ. 7000, పుష్కరిణీ ద్వారా రూ. 1,300 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ప్రసాదవిక్రయం ద్వారా రూ. 10,11,600 , శాశ్వత పూజల ద్వారా రూ. 1,77,500, కళ్యాణ కట్ట ద్వారా రూ. 85,500, అన్నదానం ద్వారా రూ. 1,11,920, లీజెస్ లీగల్ ద్వారా 4,80,257 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.