మహదేవపూర్, జూలై5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బరాజ్కు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి నీటి ప్రవాహం భారీగా పెరిగింది.
బరాజ్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.8 టీఎంసీల నీరు ఉంది. సోమవారం ఇన్ఫ్లో 45,580 క్యూసెక్కులు ఉండగా, ప్రస్తుతం మంగళవారం 60,530 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ఫ్లో 69,940 క్యూసెక్కులుగా ఉంది. బరాజ్ 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ శాఖ డీఈ సురేశ్, ఏఈ షేక్వలీ తెలిపారు.