అమరావతి : ఏపీలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. గుంటూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522కు చేరింది. 8,83,642 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 1694 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ ప్రభావంతో 7186 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 30,716 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,46,11,499 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.