రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్ప (34)ను ఆమె సొంత అన్ననే హత్య చేశాడు.
స్వప్నకు ఆమె అన్నతో కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అన్న.. స్వప్పను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వప్న హత్యపై చేవేళ్ల కోర్టులో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.