హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీఆర్ఎస్ రాష్ట్ర నేత ఎల్ రమణ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తమ జన్మదినాన్ని పురస్కరించుకొని పర్యావరణానికి మేలు కలిగించే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు రమణ కృతజ్ఞతలు తెలిపారు.