హనుమకొండ చౌరస్తా, నవంబర్12: బీసీలను కులాలవారీగా విభజించు-పాలించు అనే పద్ధతిలో అగ్రవర్ణాలు కుట్రలు చేస్తున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్సీ ఈ ప్రాంగణంలో కేయూ బీసీ జేఏసీ విద్యార్థి చైర్మన్ ఆరెగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూ ల్లో చేర్పించాలనే డిమాండ్తో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ధర్మపోరాట దీక్షకు మధుసూదనచారి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పరాయి దేశస్థుడిపై పోరాడిన ప్రజలు నేడు వారి హకుల కోసం దేశంలోని ఆధిపత్య కులాలపై పో రాటం చేయాల్సిన దుస్థితి దాపురించింద ని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ సంపదను సృష్టించే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను బీసీ సమాజం ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీసీ జేఏసీ నేతలకు సూచించారు. తెలంగాణ తరహా లో ఉవ్వెత్తున లేస్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అగ్రవర్ణాల కులాలు కుట్రలు చేస్తున్నాయని, బీసీ ఉద్యమ నేతలు వారి ఉచ్చులో పడవద్దని కోరారు.