Huzurabad | వీణవంక : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం అన్నారు. శనివారం వీణవంక మండల కేంద్రంలోని కురుమవాడలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న పనులు, చేసిన అభివృద్ధిని ప్రతి గడపకూ తిరుగుతూ వివరించారు. హుజూరాబాద్లో అభివృద్ధి ఆగకుండా పరుగులు పెట్టాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కురుమ వాడల్లోని మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమసంఘం నేతలు మల్లేశం వెంట ఉన్నారు.