చండూరు, నవంబర్ 6: రాజన్న రా జ్యం తెస్తానని, రాజన్న రాజ్యంలోనే ప్రజలకు మేలు జరుగుతుందంటూ ప్రజాప్రస్థానం యాత్ర చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు గట్టి షాక్ తగిలింది. యా త్రలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నేరళ్లపల్లికి వచ్చిన ఆమె.. రోడ్డు పక్కన పత్తి చేన్లో పనిచేస్తున్న మహిళా కూలీలను పలుకరించారు. ఈ సందర్భంగా ఓ కూలీ మాట్లాడుతూ.. ‘పనిలేక మేమంతా కర్నూలు జిల్లా నుంచి వలసొచ్చాము. అక్కడ వర్షాలు లేక, పం టలు పండకపోవటంతో బతుకుదెరువుకు కర్నూలు నుంచి వచ్చినమమ్మా. కూలీ బా గానే గిట్టుబాటు అవుతుంది’ అన్నది. తన అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు ఇక్కడికి వలస రావటంతో షర్మిల అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో అర్థం కాక మంచి రోజులు వ స్తాయమ్మా అంటూ అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. దీనికి సంబంధించిన వీడి యో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నాలుగైదేండ్లుగా ఏపీ నుంచే ఇక్కడికి కూలీల వలసలు కొనసాగుతున్నాయి.