కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని కుమారస్వామి ట్విట్టర్లో తెలిపారు.
తమ చర్చల్లో కర్ణాటక తెలంగాణ రాష్ర్టాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగిందన్నారు. కేటీఆర్ చూపిన అభిమానం, గౌరవంతో తన హృదయం నిండిపోయిందని పేర్కొన్నారు.