వేలేరు, ఫిబ్రవరి 26: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభకు వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. సభా ప్రాంగణం చుట్టూ వాహనాల పార్కింగ్కు సిద్ధం చేశారు. సుమారు 30 వేల మంది హాజరు కానున్నట్టు అంచనా వేసి, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సభా స్థలాన్ని ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి సందర్శించి సభా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
కేటీఆర్ పర్యటన వివరాలు..
మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు వేలేరు మండలం సోడాషపల్లిలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు భారీ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు సోడాషపల్లి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.