హైదరాబాద్, మార్చి 14 : రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో నిర్వహించారు. మంత్రి వేములతో బర్త్డే కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన శాసనసభ ప్రాంగణంలో మొక్కను నాటారు. వేముల ప్రశాంత్రెడ్డికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, సత్యవతిరాథోడ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఫారుఖ్ హుస్సేన్, కడియం శ్రీహరి, శేరి సుభాష్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్షిండే, నోముల భగత్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, మెతుకు ఆనంద్, దానం నాగేందర్, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.