మహబూబ్నగర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి(Ala Venkateshwar Reddy)ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) )పరామర్శించారు. జిల్లాలోని అడ్డాకుల మండలం అన్నసాగర్ గ్రామంలో వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్న కేటీఆర్ ఆల శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు(Tribute) అర్పించారు. వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు శశివర్ధన్ రెడ్డి ఇటీవలే గెండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు.
ఆయన వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.