హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃనిర్మాణం, ప్రారంభంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ఆయన పంచుకొన్నారు. ‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అందంగా పునఃనిర్మాణం పూర్తి చేసుకొన్నది. అద్భుతమైన క్షేత్రం త్వరలో ఆవిష్కారమవుతుంది. యాదాద్రిని ఇండియన్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు అభినందనలు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’ అని హాష్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశా రు. దీనిపై విశ్రాంత ఐపీఎస్ ఎం నాగేశ్వర్రావు సైతం స్పందించారు. ‘కేసీఆర్ హిందుత్వ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.. పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్రంలో హిందూ పండుగలను బహిరంగంగా చేసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడానికి ఆయన కృషి చేశారు’ అంటూ ట్వీట్చేశారు.