Minister KTR | సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ గత స్మృతులను గుర్తు చేసుకున్న కేటీఆర్.. ఇప్పుడు కూడా తన విద్యార్థి జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఫోటోను ట్వీట్ చేశారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లో తాను ఉపయోగించిన బైక్ చిత్రాన్ని కేటీఆర్ షేర్ చేశారు. 29 ఏండ్ల తర్వాత కూడా ఆ బైక్ ఇంకా పని చేస్తుందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. గత స్మృతులను గుర్తు చేసినందుకు థ్యాంక్స్ జాన్సన్ అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
That was my Bike in Nizam college😁 surprised it’s still functional after almost 29 years!!
Thanks Johnson for bringing back many memories https://t.co/CvEm4GUMPb
— KTR (@KTRTRS) November 5, 2022