హనుమకొండ, ఏప్రిల్ 19: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. దేశం గర్వించేలా హైదరాబాద్ స్థాయిలో అభివృద్ది జరుగుతున్న నగరం వరంగలేనని చెప్పారు. బుధవారం మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో మంగళవారం హనుమకొండలో మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులతో కలిసి ఎర్రబెల్లి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పర్యటన సందర్భంగా నగరంలో మొత్తం రూ.188.83 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. అనంతరం నర్సంపేటకు వెళ్లి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకస్థాపనలు చేస్తారని మంత్రి తెలిపారు. మద్యాహ్నం ఒంటిగంటకు తిరిగి హనుమకొండకు చేరుకొని కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల అధికారులతో అభివృద్దిపనులు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నట్టు వెల్లడించారు. తర్వాత కుడా మైదానంలో నిర్వహించనున్న హనుమకొండ, వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ప్రతినిథుల సభలో పాల్గొంటారని చెప్పారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్లు కేటీఆర్ సమక్షంలోబాధ్యతలు స్వీకరిస్తారని వివరించారు.