హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ ప్రభుత్వానికి మంత్రి కే తారకరామారావు కొత్త అర్థం చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు ‘సమాచారం లేదు’ (నో డాటా అవేలబుల్) అని సమాధానం ఇస్తుండటంతో ‘ఎన్డీయే అంటే నో డాటా అవేలబుల్ గవర్నమెంట్’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు. కొవిడ్తో ఎంత మంది వైద్యసిబ్బంది మరణించారు? కరోనాతో ఎన్ని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మూతపడ్డాయి? లాక్డౌన్ సమయంలో వలస కూలీల మరణాలు ఎన్ని? రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ఎవరెవరు లబ్ధిపొందారు? వ్యవసాయ చట్టాల రద్దు ఉ ద్యమంలో ఎంతమంది రైతులు మరణించా రు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు కేంద్రం చా లా సులభంగా ‘సమాచారం లేదు’ అని స మాధానం ఇస్తున్నది. దీంతో మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఈ విధంగా చురకలంటించారు.
కేటీఆర్ ట్వీట్ వైరల్గా మారింది. గంట లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వ చ్చాయి. ‘వాళ్ల దగ్గర ఇలాంటి డాటా ఉం డదు. ఏయే ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నా యి..వాటిని ఎలా అమ్మాలి.. అనే డాటా అ డగండి చెప్పేస్తారు’ అని ఓ నెటిజన్ స్పందించారు. ‘వాళ్ల దగ్గర ఏ డాటా ఉండదు.. కానీ ప్రతి ఒక్కరినీ 70 ఏం డ్ల కిందటి పాత డాక్యుమెంట్లు అడుగుతారు’ అని మరో నెటిజన్ చురకలంటించారు. ‘వాళ్ల దగ్గర దేని ధర ఎం త పెరిగిందో డాటా ఉంటుంది’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి, బ్లాక్మెయిల్తో తమ పార్టీలోకి ఎలా లాగాలి.. అనే డాటా ఉంటుంది’ అని మరొకరు విమర్శించారు. పలువురు నెటిజన్లు మీ మ్లను పోస్ట్ చేయడం విశేషం.