హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): సభలు, సమావేశాలతో ఇటీవల తీరికలేకుండా గడిపిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశానికి హాజరైన కేటీఆర్ ఆ తర్వాత జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు.
ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మంగళవారం కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు దూరమయ్యారు. వైద్యుల సూచనతో ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండురోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.