KTR | భూములపై కన్నేసి తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తలా తోక లేకుండా ఆలోచన చేయకుండా అట్టర్ ప్లాప్ అయిన స్కిల్ యునివర్సిటీని పట్టుకొని జీవో నెంబర్ 97 పేరుతో దానికి దీనికి లింకు పెట్టి బోడగుండుకు మోకాలుకు ముడిపెడుతూ పాలిటిక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను ఆగం చేస్తున్నారు. జీవో నెం 97, పాలిటెక్నిక్ విద్యార్థులు, స్కిల్ యూనివర్సిటీ నాటకాలపై నిన్ను వదిలిపెట్టం. సీఎం రేవంత్ ఆగడాలపై అసెంబ్లీలో నిలదీస్తాం. విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.
భూముల మీద కన్ను వేసి పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్ట మీద ముఖ్యమంత్రి కొడుతున్నాడు
GO 97 మీద పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై రేపు శాసనసభ సమావేశాల్లో నిన్ను నిలదీస్తాము
– కేటీఆర్ https://t.co/fjHw4bBssT pic.twitter.com/IYXWcYbTxJ
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026