హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగ యువకుల సమస్యలను సానుకూల దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాంయాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన సరార్ ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావడం ప్రజాపాలనలో నిషేధమా? అని ప్రశ్నించారు.
గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తున్నదని, ఇది సరికాదని హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజారాంయాదవ్ సహా మిగతా విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ వారిని పట్టించుకోవడం మానేసిందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిషరించకుంటే ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెకారో వాళ్లే ఈ ప్రభుత్వ పతనాన్ని శాసిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరితో ముందుకెళ్తే బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.