హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెల్లబంగారం తెల్లబోతున్నదని, రైతు ఆగమైతుంటే ప్రభుత్వం పత్తాలేదని విమర్శించారు. బోనస్ దేవుడెరుగు, మద్దతు ధరకే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ కొర్రీలు పెట్టి, సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపివేసిందన్నారు.
క్విటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి, ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కాంగ్రెస్ సర్కారు కూర్చున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంటైన పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు, శ్రద్ధలేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదని విమర్శించారు. ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని, సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్షక ద్రోహి కాంగ్రెస్ అని, రైతు డిక్లరేషన్ ఒక బోగస్ అని చెప్పారు..
‘తెల్ల బంగారం తెల్లబోతున్నది
బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు
పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు
సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది
రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి..
ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నది కాంగ్రెస్ సర్కారు.
రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి..
కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు.. శ్రద్ధలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదు.
ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు..పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారు.
కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెల్ల బంగారం తెల్లబోతున్నది
బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు
పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు
సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది
రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు… pic.twitter.com/pPCYjMoTZE
— KTR (@KTRBRS) October 26, 2024