హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నదనడానికి ఇదే క్లాసిక్ ఉదాహరణ అన్నారు.
పీఎం కేర్స్ను పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం ఇచ్చిన సమాచారంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాజ్యాంగం, పార్లమెంటు, ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్ ఫండ్ను సృష్టించలేదని కేంద్రం ఢిల్లీ కోర్టుకు తెలిపింది.