హైదరాబాద్: తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు. భారత వాతావరణ శాఖ (IMD) లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైందని తెలిపారు. నీటి సమస్యలు తీర్చే సామర్ధ్యం లేక.. లోటు వర్షపాతమంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరమైన మాట్లాడటం పట్ల తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంపై రేవంత్ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని విమర్శించారు.
‘IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం (excess rainfall) తెలంగాణలో నమోదు అయ్యింది. నీటి సమస్యలని తీర్చే చేవలేక, చేతకాక .. లోటు వర్షపాతం (deficit rainfall) అని మాట్లాడడం విడ్డూరం!
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సత్యదూరపు మాటలు మాట్లాడుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వారి ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకొంటున్నారు.
రైతు సమస్యలు తీర్చడం మాట అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యింది!’
IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం (excess rainfall) తెలంగాణలో నమోదు అయ్యింది.
నీటి సమస్యలని తీర్చే చేవలేక, చేతకాక .. లోటు వర్షపాతం (deficit rainfall) అని మాట్లాడడం విడ్డూరం!
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,… pic.twitter.com/JEemdDqmFe
— KTR (@KTRBRS) March 7, 2024