సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్షో(KTR road show )ప్రారంభమైంది. బుధవారం పట్టణంలోని కింగ్స్ దాబా నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షో ప్రారంభమైంది. సంగారెడ్డి పాత బస్టాండ్ వరకు కొనసాగనున్న కేటీఆర్ రోడ్ షోలో వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సంగారెడ్డి బీఅర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత సంగారెడ్డి పట్టణంలోని గంజ్ మైదాన్లో బీఅర్ఎస్ విద్యార్థి, యువజన అత్మీయ సమ్మేళనం, బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.