KTR : రాష్ట్రంలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ నగరంలో రోడ్డుకే ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత (Congress senior leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని కేటీఆర్ ప్రశ్నించారు. ‘హలో రాహుల్ గాంధీ.. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా?’ అంటూ ఆయన తన పోస్ట్ను ప్రారంభించారు.
పేద ప్రజల ఇళ్లపై, వారి జీవనోపాధిపై రోజూ దాడులు చేస్తున్న ఈ అమానవీయ చర్యలకు మీరు సమాధానం చెప్పాలని రాహుల్ను డిమాండ్ చేశారు. వరంగల్లో దారివెంట ఉన్న ఇళ్లను ఎందుకు కూల్చారు..? మిస్ వరల్డ్ అందాల పోటీ కోసం మార్గాన్ని అందంగా చూపించడానికే ఈ చర్యలు చేపట్టారా..? ఇది ప్రజా పాలనేనా..?’ అని ప్రశ్నించారు. ‘ఒకవైపు రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రాజభవనాల్లో విందులు పెడుతూనే.. మరోవైపు పేదల జీవితాలను బుల్డోజర్ల కింద నలిపేస్తారా..?’ అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చడాన్ని పూర్తిగా అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను సమాధానాలు కోరుతున్నానని ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయి.
Hello @RahulGandhi Ji, does your Congress Govt have a secret contract with Bulldozer companies?
What’s behind this incessant drive to destroy people’s homes & livelihoods on a daily basis? Why are demolitions being carried out in Warangal?
People are being told that it’s to… pic.twitter.com/XnUjDzdgFe
— KTR (@KTRBRS) May 14, 2025