KTR | ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించారు.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిందని తెలిపారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్కి పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ అజరామర కీర్తిని చాటిచెప్పే విధంగా వారి ఎత్తయిన విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.