హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు.
ట్విట్టర్ వేదికగా ‘మోదీ గారు.. హర్ ఘర్ తిరంగా బాగానే ఉన్నది. కానీ, 2022 నాటికి అందరికీ ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? అది కూడా బూటకమేనా?’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ను మంత్రి కేటీఆర్ హిందీలో పోస్ట్ చేయటంతో, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నెటిజన్లు రీట్వీట్లు, లైక్లతో హోరెత్తిస్తున్నారు.