తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలు అధినేతలు, ఎన్నారైలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన లండన్లో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్తో సమావేశమయ్యారు.
తెలంగాణలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. హైదరాబాద్ కు రావాల్సిందిగా అనిల్ అగర్వాల్ను మంత్రి కేటీఆర్ కోరారు.