హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. మంగళవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను స్వయంగా కలిసి నివేదికను సమర్పించారు. డిసెంబర్ 2020లో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఈ ఐటీ హబ్లో ప్రస్తుతం 14కుపైగా కంపెనీలు పనిచేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఐటీహబ్ కారణంగా స్థానికంగా 350 మంది యువకులు ఐటీ ఉద్యోగులుగా పనిచేసే అవకాశం కలిగినట్టు అందులో వెల్లడించారు.