యాదాద్రి: సోదరీ.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఆడపడుచులు.. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి అనుబంధాన్ని చాటుకున్నారు. ఆడపడుచుల రాకతో గ్రామాలన్నీ సందడిగా కనిపించాయి.
హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సోదరుడు కారింగుల శ్రీనివాస్రెడ్డితో పాటు వ్యక్తిగత కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, వినయ్కుమార్, ఎల్లారెడ్డి, గన్మెన్లు, డ్రైవర్లలకు రాఖీలు కట్టి మీఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కేటీఆర్కు, ఎంపీ జోగినపల్లి సంతోశ్రావుకు రాఖీలు కట్టిన ప్రభుత్వ విప్..
రక్షాబంధన్ను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆదివారం రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుకు, ఎంపీ జోగినపల్లి సంతోశ్రావుకు హైదరాబాద్ ప్రగతిభవన్లో రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు.