హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ లైం గిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఉదయ్కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో మంగళవారం అదుపులోకి తీ సుకునిఉమెన్ సేఫ్టీ వింగ్కు అప్పగించారు. కాగా తాను ఎకడికీ పారిపోలేదని, తన నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు స్వ గ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న తాత్కాలిక అడ్రస్కు వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారని, త న శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని అన్నా రు. ‘పోలీస్ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దర్యాప్తు అధికారులకు నేను సహకరిస్తాను. నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. నేను ఏ తప్పూ చేయలేదు’ అని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్పై ఉదయ్కృష్ణారెడ్డి దాడి చేసినట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయినట్టు తెలిసింది. కేసు నమోదైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెపై భౌతికంగా దాడి జరిగినట్టు తేల్చారు. బాధితురాలి గొంతు నులిమినట్టు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కొట్టిన కమిలిన గాయా లు, ఎడమ కాలిపైనా గాయం ఉన్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే ఉదయ్కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిసింది.