KTR | సీఎం రేవంత్రెడ్డి మెడల పేగులు వేసుకుంటా అంటున్నడని.. ఆయన బోటి పేగులు కొడుతున్నడా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పేరు పొంగనాలు రేవంత్రెడ్డి అని అంటున్నానన్నారు. గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తుమ్మిడి, బమ్మిడి చేసి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. సీఎం జీవో తీసి రైతులకు, పెంచిన పెన్షన్లు, రైతుబంధు, రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు అయ్యాకా.. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీలో చేరుతాడన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని.. బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు. ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు సగం బీజేపీ.. సగం కాంగ్రెస్ అన్నారు. బండి సంజయ్ని ఐదు సంవత్సరాలు ప్రజలు ఎట్లా భరించారోనన్న కేటీఆర్.. ఆయన మాత్రం కరీంనగర్కు గుది బండ సంజయ్ అన్నారు. గంభీరావుపేటకు 24గంటల నీళ్లు ఉండాలని కేసీఆర్ చిరకాల కోరిక అని.. ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్టులో నిత్యం నీళ్లు ఉండేవి ఇప్పుడు అందులో నీళ్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు.
ఎర్రటి ఎండల్లో కూడా కాళేశ్వరంలో రోజుకు ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయన్నారు. కేసీఆర్ సీఎం అయితే.. అవి ఒడిసి పట్టి నీళ్లు ఎత్తిపోసేలా ఇంజినీర్లు కృషి చేశారన్నారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రిపేర్ చేయించి నీళ్లు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యలు కోసం గొంతు విప్పుతామని.. కాంగ్రెస్ భరతం పడుతామన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. లేకపోతే ప్రజలు మీ వీపులు పగులగొడుతరన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కదన భేరి సభపై కుట్రలు పన్నుతున్నారని.. పొలాలు ఎండిపోతే బోనస్ ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. ఎండిన పంటలకు రూ.10వేల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.