సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ.80 కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన మేఘా కంపెనీకి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలి.. ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినా ఆ కంపెనీపై సీఎం రేవంత్రెడ్డికి అంత ప్రేమ ఎందుకో..
– కేటీఆర్
KTR | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలోని నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఈ టెండర్లు దకేలా చేయడమంటేనే ‘నీకిది-నాకది’ అని క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు.
ఎల్అండ్టీ, ఎన్సీసీ లాంటి పెద్ద కంపెనీలకు టెండర్లు దకకుండా కావాలనే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఎల్అండ్టీ, ఎన్సీసీ లాంటి సంస్థలను టెక్నికల్ రీజన్స్ పేరు చెప్పి డిస్క్వాలిఫై చేస్తున్న క్రమంలో ప్రజలు ఏమనుకుంటారోననే సోయి తప్పి సిగ్గులేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేఘా, రాఘవ సంస్థలకు ఈ ప్రాజెక్ట్ను కట్టబెట్టేందుకు రేవంత్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఆ రెండు సంస్థలు కేక్ను పంచుకున్నట్టు 3.9 శాతం, 3.95 శాతం పంచుకునే విధంగా బిడ్లు వేయడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన మేఘా కంపెనీకి పనులు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ మేఘా కంపెనీపై సీఎం రేవంత్రెడ్డికి అంత ప్రేమ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా, ఆంధ్రా కంపెనీ అంటూ ఏ మేఘా కంపెనీపై రేవంత్రెడ్డి ఆరోపణలు చేశారో, ఇప్పుడు అదే కంపెనీకి సిగ్గులేకుండా ప్రాజెక్ట్ పనులను ఎందుకు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్లిస్ట్లో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్ను బహుమానంగా ఇవ్వడం వెనుక భారీ అవినీతి కుంభకోణం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, రైతుభరోసా ఇచ్చేందుకు పైసలు లేవంటున్న రేవంత్రెడ్డి రూ. 4,350 కోట్లతో ఎవరి జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలి.. రేవంత్రెడ్డి చేతగాని పాలనలో ప్రజలు బాధపడుతుంటే, ఆయన మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో పడ్డరు.
-కేటీఆర్
సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన కేసీఆర్పై దుర్భాషలాడుతూ చరిత్ర నుంచి ఆయన పేరును చెరిపేయాలనుకోవడం మూర్ఖత్వం.. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు పదిలంగా ఉంటది.. ఆ పేరును ఎవరూ చెరిపేయలేరని గుర్తుపెట్టుకో ఛీప్ మినిస్టర్..
-కేటీఆర్
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవనే రేవంత్ ఇంత ఖర్చుతో ఎవరి జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాం డ్ చేశారు. రేవంత్రెడ్డి చేతగాని పాలనలో ఓ వైపు ప్రజలు బాధపడుతుంటే, మరోవైపు ఆయన మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. మొత్తం రూ. 4,350 కోట్ల ప్రాజెక్ట్ను మేఘా, రాఘవ సంస్థలకు అప్పగించి వారి ద్వారా వేల కోట్ల రాపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టనుందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే వారు మాత్రం తమ పార్టీ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి బాగోతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రేవంత్రెడ్డి అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘నువ్వు చెప్పులేసుకుని రాజకీయాల్లో చిన్న పోరనిలా తిరుగుతున్నప్పుడే… కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పదవిని తృణప్రాయంగా వదిలేశారు.. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్లో బిజీగా ఉన్నప్పుడే.. కేసీఆర్ స్వరాష్ట్రం కావాలని స్వప్నించాడు. నువ్వు తెలంగాణ ఉద్యమ గొంతుకలను అణచివేయడానికి తుపాకీ ఎక్కుపెట్టినప్పుడే.. కేసీఆర్ తన ప్రాణాలను రాష్ట్ర సాధన కోసం పణంగా పెట్టాడు’ అంటూ శనివారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పదించారు. ‘ఉద్యమం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ ఎక్కడ.. ఉద్యమంపైనే తుపాకీ ఎక్కుపెట్టిన నువ్వెక్కడ?’ అంటూ నిలదీశారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిర పరిచేందుకు రేవంత్రెడ్డి డబ్బుల సంచులు మోశారని, కేసీఆర్ మాత్రం తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించేలా తయారు చేసేందుకు తన మేధస్సుకు పదనుపెట్టారని పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన కేసీఆర్ ఈ రాష్ర్టానికి గర్వకారణమని వెల్లడించారు. రేవంత్రెడ్డి లాంటి జోకర్.. కేసీఆర్ మీద అసత్య ప్రచారాలు చేస్తూ దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరును చెరిపేయాలనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు పదిలంగా ఉంటది.. ఆ పేరును ఎవరూ చెరిపేయలేరని గుర్తుపెట్టుకో ఛీప్ మినిస్టర్’ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.